కరోనాతో జూ అసిస్టెంట్ క్యూరేటర్ మృతి
ABN , First Publish Date - 2021-05-11T04:28:40+05:30 IST
కరోనాతో ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల అసిస్టెంట్ క్యూరేటర్ ఎం.రాజారావు (58) మృతి చెందారు.
ఆరిలోవ, మే 10: కరోనాతో ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల అసిస్టెంట్ క్యూరేటర్ ఎం.రాజారావు (58) మృతి చెందారు. కొవిడ్ బారినపడిన ఆయన 20 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆరేళ్లుగా అసిస్టెంట్ క్యూరేటర్గా సేవలందించిన రాజారావు మృతి చెందడం ఎంతో బాధగా ఉందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని జూ క్యూరేటర్ డాక్టర్ నందనీ సలారియా పేర్కొన్నారు. మంచి అధికారిని కోల్పోయామని జూ సిబ్బంది కూడా విచారం వ్యక్తం చేశారు.