రైల్వే బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులకు అభినందన
ABN , First Publish Date - 2021-04-13T06:08:40+05:30 IST
జాతీయ సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇండియన్ రైల్వే స్వర్ణ పతకం సాధించి స్టార్ ఆఫ్ ఇండియా టైటిల్ సొంతం చేసుకున్నదని వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు.
విశాఖపట్నం(స్పోర్ట్సు), ఏప్రిల్ 12: జాతీయ సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇండియన్ రైల్వే స్వర్ణ పతకం సాధించి స్టార్ ఆఫ్ ఇండియా టైటిల్ సొంతం చేసుకున్నదని వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు. జైపూర్లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్స్లో రైల్వే జట్టు 35-27, 35-29 స్కోరు తేడాతో తమిళనాడు విజయం సాధించిందని పేర్కొన్నారు. ఇండియన్ రైల్వే జట్టుకు వాల్తేరు డివిజన్ ఆటగాళ్లు వెంగళరావు, గణేశ్లు ప్రాతినిధ్యం వహించారన్నారు ఈ సందర్భంగా సోమవారం డీఆర్ఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వాల్తేరు డివిజన్ స్పోర్ట్సు ఆఫీసర్ ప్రదీప్ యాదవ్ హాజరై వేణుగోపాలరావు, గణేశ్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో సహాయ క్రీడాధికారులు బి.అవినాష్, ఎం.హరినాథ్, బాల్ బ్యాడ్మింటన్ ఇన్చార్జి ఆఫీసర్ వి.రాంబాబు, రైల్వే స్పోర్ట్సు ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.