బ్రిడ్జ్ అండ్ రూఫ్తో ఆర్ఐఎన్ఎల్ ఎంఓయూ
ABN , First Publish Date - 2021-01-17T05:24:24+05:30 IST
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్ - విశాఖ ఉక్కు) సివిల్, స్ట్రక్చరల్, ఎలక్ర్టికల్, మెకానికల్ ఇంజనీరింగ్ పనుల కోసం బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీతో శనివారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుంది.
విశాఖపట్నం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్ - విశాఖ ఉక్కు) సివిల్, స్ట్రక్చరల్, ఎలక్ర్టికల్, మెకానికల్ ఇంజనీరింగ్ పనుల కోసం బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీతో శనివారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుంది. ఈ ఒప్పందం 2021 నుంచి మూడేళ్లు అమలులో ఉంటుంది. అక్కడి నుంచి మరో రెండేళ్లు పొడిగించుకునే వెసులుబాటు ఉంది. బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ భారీ పరిశ్రమల శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ కావడం విశేషం. ఆర్ఐఎన్ఎల్ రాయబరేలిలోను ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ వంటి అనేక ప్రాజెక్ట్లకు భారీ పరిశ్రమల శాఖతో కలిసి పనిచేస్తోంది. ఆర్ఐఎన్ఎల్ సీఎండీ పీకే రథ్ సమక్షంలో జరిగిన ఎంఓయూపై ఆర్ఐఎన్ఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ కేకే ఘోష్, బ్రిడ్జ్ అండ్ రూఫ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రావత్లు సంతకాలు చేశారు.