AP: ఏవోబీలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ
ABN , First Publish Date - 2021-09-14T17:09:24+05:30 IST
ఏవీబీలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తున్న ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు దుబాసి శంకర్ అలియాస్ పెద్ద మహేందర్ అలియాస్ రమేష్ను ఒడిశా పోలీసులు పట్టుకున్నారు.
విశాఖపట్నం: ఏవీబీలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తున్న ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు దుబాసి శంకర్ అలియాస్ పెద్ద మహేందర్ అలియాస్ రమేష్ను ఒడిశా పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా ముత్తరాసి చెట్ల గ్రామానికి చెందిన దుబాసి శంకర్పై 20 లక్షల రివార్డ్ ఉంది. 28 ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీలో శంకర్ కీలక స్థానాల్లో పనిచేశాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దుబాసిశంకర్, పెద్ద బైలు ఏరియా కమిటీ సభ్యుడు మాధవి సోనాలి అలియాస్ కిరణ్లు బైపర్ గూడ వద్ద పోలీసులకు చిక్కారు.