Visakhaలో పేలిన గ్యాస్ సిలిండర్

ABN , First Publish Date - 2021-11-18T13:40:09+05:30 IST

విశాఖలోని శ్రీహరిపురంలో గల ఇందిరకాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి భవనం నేలమట్టమైంది.

Visakhaలో పేలిన గ్యాస్ సిలిండర్

విశాఖపట్నం: నగరంలోని శ్రీహరిపురంలో గల ఇందిరకాలనీలో ఈరోజు(గురువారం) తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రులు అక్కిరాపు నారాయణమ్మ (50), బుర్రా నవీన్ (22)గా గుర్తించారు. పేలుడు ధాటికి ఇళ్లు కొంతమేర ధ్వంసమైంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-18T13:40:09+05:30 IST