విశాఖలో రౌడీషీటర్ దారుణ హత్య
ABN , First Publish Date - 2021-04-22T15:48:34+05:30 IST
విశాఖ కంచరపాలెంలో రౌడీషీటర్ శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి శ్రీనివాస్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు సమాచారం.
విశాఖపట్నం: విశాఖ కంచరపాలెంలో రౌడీషీటర్ శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి శ్రీనివాస్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్పై పోలీస్ రికార్డుల్లో దొంగతనం కేసులు ఉన్నాయి. హత్యపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.