ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం తగదు
ABN , First Publish Date - 2021-05-19T04:36:08+05:30 IST
తమ రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ అన్నారు.
ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ
కూర్మన్నపాలెం, మే 18: తమ రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 96వ రోజు కొనసాగాయి. మంగళవారం ఈ దీక్షల్లో టీపీపీ, సీపీపీ, పీఈఎం, ఆర్ఎండీ విభాగాలకు చెందిన కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ ఉచిత పథకాల పేరుతో ప్రజలను పాలకులు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణే తమ ధ్యేయమన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ కె.సత్యనారాయణ, గంధం వెంకటరావు, జె.రామకృష్ణ, వి.ప్రసాద్, గంగవరం గోపి, నాయుడు, మహేశ్వరరావు, అవతారం, శివకుమార్, సత్యనారాయణ, కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.