ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం తగదు

ABN , First Publish Date - 2021-05-19T04:36:08+05:30 IST

తమ రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ అన్నారు.

ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం తగదు
రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న ఉద్యోగులు

ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, మే 18: తమ రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని   ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 96వ రోజు కొనసాగాయి. మంగళవారం ఈ దీక్షల్లో  టీపీపీ, సీపీపీ, పీఈఎం, ఆర్‌ఎండీ విభాగాలకు చెందిన కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ ఉచిత పథకాల పేరుతో ప్రజలను పాలకులు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణే తమ ధ్యేయమన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ కె.సత్యనారాయణ, గంధం వెంకటరావు, జె.రామకృష్ణ, వి.ప్రసాద్‌, గంగవరం గోపి, నాయుడు, మహేశ్వరరావు, అవతారం, శివకుమార్‌, సత్యనారాయణ, కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-19T04:36:08+05:30 IST