ఉక్కు ఉద్యమాన్ని ఉధృతం చేయాలి

ABN , First Publish Date - 2021-11-21T06:26:53+05:30 IST

పోరాటాలతోనే కార్మికులకు అంతిమ విజయం సిద్ధిస్తుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 282వ రోజు కొనసాగాయి.

ఉక్కు ఉద్యమాన్ని ఉధృతం చేయాలి
రిలే నిరాహార దీక్షల శిబిరంలో పాల్గొన్న కార్మికులు

పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, నవంబరు 20: పోరాటాలతోనే కార్మికులకు అంతిమ విజయం సిద్ధిస్తుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 282వ రోజు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలలో  ఈఎండీ,డబ్ల్యూఎండీ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ వానైనా, ఎండైనా ఎంతో పట్టుదలతో దీక్షలలో పాల్గొన్న కార్మికులను అభినందించారు.  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు మాట్లాడుతూ ప్రజా పోరాటాలతో ఉక్కు పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. మరో నాయకుడు కేఎస్‌ఎన్‌ రావు మాట్లాడుతూ మోదీ పాలనలో ప్రభుత్వరంగాన్ని మరింత బలహీనపరుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ శిబిరంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు ఎన్‌.రామారావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, జి.ఆనంద్‌, మస్తానప్ప, రామ్మోహన్‌కుమార్‌, పైడిరాజు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-21T06:26:53+05:30 IST