ప్రజా సంపద విక్రయం తగదు
ABN , First Publish Date - 2021-06-19T05:51:17+05:30 IST
ప్రజా సంపదను కార్పొరేట్ కంపెనీలకు విక్రయించడం తగదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ అన్నారు.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ
కూర్మన్నపాలెం, జూన్ 18: ప్రజా సంపదను కార్పొరేట్ కంపెనీలకు విక్రయించడం తగదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు 127వ రోజు కొనసాగాయి. శుక్రవారం ఈ దీక్షలలో ఎస్ఎంఎస్ 1, 2, ఇంటక్ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలను కార్మికులు తిప్పి కొట్టాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు బి.మురళీరాజు మాట్లాడుతూ దేశ సంపదను కూడబెడుతున్న కార్మిక వర్గం కడుపుకొడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే విధంగా పోరాటాలు ఉధృతం చేయాలన్నారు. పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ ఐక్య పోరాటాలతోనే విజయం తఽథ్యమన్నారు. పోరాట కమిటీ నేతలు జీవీ రమణయ్య, పీవీ రమణ మూర్తి, ధనుంజయ సాహు, కృష్ణ, మోహన్, వి.ప్రసాద్, గంగవరం గోపి తదితరులు పాల్గొన్నారు.