పెరుగుబజార్- రైల్వేస్టేషన్ రోడ్డుకు రాంజీ పేరు పెట్టాలి
ABN , First Publish Date - 2021-10-29T06:13:07+05:30 IST
అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలందించిన మున్సిపల్ మాజీ చైర్మన్ కడిమిశెట్టి రాంజీ పేరును పెరుగుబజార్-రైల్వేస్టేషన్ రోడ్డుకు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోరారు.
మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ
అనకాపల్లి, అక్టోబరు 28: అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలందించిన మున్సిపల్ మాజీ చైర్మన్ కడిమిశెట్టి రాంజీ పేరును పెరుగుబజార్-రైల్వేస్టేషన్ రోడ్డుకు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో విస్తరణ కానున్న ఈ రోడ్డుకు రాంజీ మార్గ్ అని నామకరణం చేసి అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. ఈ అంశంపై ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఆలోచన చేసి అభిప్రాయాలు సేకరించాలని కోరారు. టీడీపీ హయాంలోనే ఈ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. ఈ రోడ్డులోని భవన యజమానులను ఒప్పించడంలో కడిమిశెట్టి రాంజీ విశేషంగా కృషి చేశారన్నారు. అతని వెంట టీడీపీ నాయకులు మళ్ల సురేంద్ర, సతీశ్, గుండా సాయి ఉన్నారు.