ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-07T05:39:10+05:30 IST

ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతి

కొమ్మాది, డిసెంబరు 6: ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధురవాడ వుడా కాలనీలో ఎం.సత్యనారాయణరాజు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. కుటుంబ సమస్యలు నేపథ్యంలో పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆర్థిక ఇబ్బందులకు కుటుంబ సమస్యలు కూడా తోడవ్వడంతో నవంబరు 26న ఇంట్లో విషం తాగి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో తండ్రి రామరాజు ఆయనను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణరాజు సోమవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-12-07T05:39:10+05:30 IST