హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి

ABN , First Publish Date - 2021-05-22T04:42:31+05:30 IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి
పీలా గోవింద సత్యనారాయణ

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ

అనకాపల్లి, మే 21:
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరగాలని, వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎన్నికలు జరిపించిందని ఆరోపించారు. అందువల్లే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలను బహిష్కరించిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దేశంలోనే నిరంకుశపాలనకు కేరాఫ్‌గా మారారని ఆరోపించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కేంద్ర బలగాలతో ప్రజా స్వామ్యబద్ధంగా జరపాలని పీలా డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-22T04:42:31+05:30 IST