విశాఖ ఉక్కు పరిరక్షణ అందరి బాధ్యత
ABN , First Publish Date - 2021-12-19T06:16:32+05:30 IST
విశాఖ ఉక్కు పరిరక్షణ అందరి బాధ్యత అని జనసేన నాయకులు గడసాల అప్పారావు, కరణం కనకారావులు పేర్కొన్నారు.
![విశాఖ ఉక్కు పరిరక్షణ అందరి బాధ్యత](https://media.andhrajyothy.com/appimg/galleries/1921121912443678/12192021004458n88.jpg)
జనసేన డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభం
కూర్మన్నపాలెం, డిసెంబరు 18: విశాఖ ఉక్కు పరిరక్షణ అందరి బాధ్యత అని జనసేన నాయకులు గడసాల అప్పారావు, కరణం కనకారావులు పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా కార్యకర్తలు శనివారం ఉక్కు ఉద్యోగుల, నిర్వాసితుల రిలే నిరాహార దీక్షల శిబిరాలకు విచ్చేసి తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా వ్యక్తలు మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ పరిరక్షణకు ఎంపీలు అందరూ పార్లమెంట్లో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాదా శ్రీను, కళావతి, మల్లెపూడి మురళీకృష్ణ, పిడుగు బంగారాజు, భాస్కరరాజు, అడపా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.