30న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక

ABN , First Publish Date - 2021-10-21T06:09:55+05:30 IST

భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 30వ తేదీన నగరానికి వస్తున్నారు.

30న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక

విశాఖపట్నం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 30వ తేదీన నగరానికి వస్తున్నారు. ఆయన సబ్బవరంలో దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే గాయత్రి విద్యాపరిషత్‌ విద్యా సంస్థలను సందర్శిస్తారు. ఆయన వచ్చే నెల రెండో తేదీన తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళతారు.

Updated Date - 2021-10-21T06:09:55+05:30 IST