వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థ మెరుగుపడాలి

ABN , First Publish Date - 2021-12-31T06:23:52+05:30 IST

వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థ మెరుగుపర్చడం ద్వారా రైతుల ఆదాయాలను అభివృద్ధి చేయవచ్చని ఏపీ వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షుడు ఎం.వి.నాగిరెడ్డి అన్నారు.

వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థ మెరుగుపడాలి
సదస్సులో ప్రసంగిస్తున్న నాగిరెడ్డి

అగ్రిమిషన్‌ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి


అనకాపల్లి అగ్రికల్చర్‌, డిసెంబరు 30: వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థ మెరుగుపర్చడం ద్వారా రైతుల ఆదాయాలను అభివృద్ధి చేయవచ్చని ఏపీ వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షుడు ఎం.వి.నాగిరెడ్డి అన్నారు. మార్కెట్‌కు అనువైన పంటల ప్రణాళికలు, వైవిధ్యం అనే అంశంపై ఆర్‌ఏఆర్‌ఎస్‌లో గురువారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. వ్యవసాయం గ్రామీణాభివృద్ధి, విధాన పరిశోధన (కార్ప్‌) సభ్యులు జి.రఘునాథరెడ్డి ప్రసంగిస్తూ ఉత్పాదకత పెంచడంతో పాటు ఉద్యాన పంటల సాగు చేపట్టాలని సూచించారు. ఏడీఆర్‌ భరతలక్ష్మి ఉత్తర కోస్తాలో పంటల సరళి, వ్యవసాయ స్థితిగతులను వివరించారు. అగ్రిమిషన్‌ సభ్యుడు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, వర్సిటీ పాలక మండలి సభ్యులు దేవుళ్లు, ఎస్‌వీఎస్‌ఆర్‌ నేతాజీ, సలహా మండలి సభ్యులు రామారావు ప్రసంగించారు. 

Updated Date - 2021-12-31T06:23:52+05:30 IST