తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
ABN , First Publish Date - 2021-08-16T16:41:27+05:30 IST
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్రను ఆనుకుని
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్రను ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. దీనిపై ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.