గవర్నర్‌ హరిబాబుకు టీడీపీ నేతల అభినందనలు

ABN , First Publish Date - 2021-07-08T06:32:12+05:30 IST

మిజోరం గవర్నర్‌గా నియమితులైన డాక్టర్‌ కంభంపాటి హరిబాబును బుధవారం ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలు కలిసి అభినందనలు తెలిపారు.

గవర్నర్‌ హరిబాబుకు టీడీపీ నేతల అభినందనలు
హరిబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న వెలగపూడి, పల్లా శ్రీనివాసరావు, పీలా గోవింద, తదితరులు

సిరిపురం, జూలై 7: మిజోరం గవర్నర్‌గా నియమితులైన డాక్టర్‌ కంభంపాటి హరిబాబును బుధవారం ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు విశాఖ ఎంపీగా హరిబాబు అందించిన సేవలను కొనియాడారు. గవర్నర్‌గా మిజోరం ప్రజల జీవితాల్లో డాక్టర్‌ హరిబాబు వెలుగులు నింపగలరన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాళ్ల శంకర్‌, గొలగాని పోలారావు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-08T06:32:12+05:30 IST