30 నుంచి అరకులోయకు ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2021-12-28T06:02:23+05:30 IST

పర్యాటకుల సౌకర్యార్థం ఈ నెల 30 నుంచి జనవరి 16 వరకు అరకులోయకు ప్రత్యేక రైలు నడపనున్నట్టు తూర్పు కోస్తా రైల్వే సోమవారం ప్రకటించింది. 08525 నంబరు గల రైలు ఉదయం ఏడు గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి 11.30 గంటలకు అరకులోయ చేరుతుంది.

30 నుంచి అరకులోయకు ప్రత్యేక రైలు

30 నుంచి అరకులోయకు ప్రత్యేక రైలు

విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): పర్యాటకుల సౌకర్యార్థం ఈ నెల 30 నుంచి జనవరి 16 వరకు అరకులోయకు ప్రత్యేక రైలు నడపనున్నట్టు తూర్పు కోస్తా రైల్వే సోమవారం ప్రకటించింది. 08525 నంబరు గల రైలు ఉదయం ఏడు గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి 11.30 గంటలకు అరకులోయ చేరుతుంది. అటు నుంచి 08526 నంబరుతో మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఈ రైలులో సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు 8, లగేజ్‌ కమ్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు మరో రెండు ఉంటాయి. 



27,964 మందికి రూ.50.45 కోట్లు

పలు పథకాల లబ్ధిదారుల ఖాతాలకు నేడు డబ్బులు జమ

విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నవరత్నాల్లో పలు పథకాల కింద జిల్లాలో 27,964 మంది లబ్ధిదారుల ఖాతాలకు మంగళవారం రూ.50.45 కోట్లు జమ చేయనున్నట్టు డీఆర్‌డీఏ పీడీ పి.విశ్వేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్‌ చేయూత కింద 24,502 మందికి రూ.45.94 కోట్లు, ఆసరా పథకంలో 131 మందికి రూ.1.33 కోట్లు, సున్నా వడ్డీ కింద 1,486 మందికి రూ.0.69 కోట్లు, వాహనమిత్రలో 635 మందికి రూ.0.63 కోట్లు, కాపునేస్తం పథకంలో 1,210 మందికి రూ.1.81 కోట్లు జమ చేస్తామన్నారు. 




మరో 13 కరోనా కేసులు

విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 13 మందికి కొవిడ్‌ వైరస్‌ సోకినట్టు సోమవారం నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,59,340కు చేరింది. ఇందులో 1,58,112 మంది కోలుకోగా, మరో 121 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌ బారినపడి 1,107 మంది మృతిచెందారు. 

Updated Date - 2021-12-28T06:02:23+05:30 IST