రక్తదాన శిబిరానికి విశేష స్పందన

ABN , First Publish Date - 2021-10-14T06:22:30+05:30 IST

మండల కేంద్రంలోని వివేకానంద కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.

రక్తదాన శిబిరానికి విశేష స్పందన
రక్తదాతలకు సర్టిఫికెట్లు అందచేస్తున్న అటవీ శాఖ అధికారి రాంనరేశ్‌

95 మంది యువకుల స్వచ్ఛంద రక్తదానం


చోడవరం, అక్టోబరు 13: మండల కేంద్రంలోని వివేకానంద కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన  లభించింది. చేగువేరా ఫౌండేషన్‌, విశ్వనాథ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 95 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సంజీవిని బ్లడ్‌ బ్యాంక్‌ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో వివేకానంద కళాశాల చైర్మన్‌ పైలా ప్రసాదరావు, విశ్వనాథ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వాహకుడు, రక్తదాన శిబిరాల ప్రోత్సాహకుడు పీడీపీ నారాయణరావు (బాబ్జీ), చేగువేరా ఫౌండేషన్‌ సభ్యులు, అటవీశాఖ రేంజి అధికారి బి.రాంనరేవ్‌, నెహ్రూ యువకేంద్రం జిల్లా కోఆర్డినేటర్‌ ఉమామహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. 


Updated Date - 2021-10-14T06:22:30+05:30 IST