జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత
ABN , First Publish Date - 2021-12-30T05:55:59+05:30 IST
శాస్త్రం బోధించడానికి అధ్యాపకులు లేరు. అలాగే ఆంగ్లం అధ్యాపక పోస్టులు 2, తెలుగు 2, హిందీ 8, మ్యాథ్స్ 5, ఫిజిక్స్ 1, జువాలజీ 4, ఎకానమిక్స్ 6, సివిక్స్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధ్యాపకుల కొరత వున్న కళాశాలల్లో బోధన సక్రమంగా సాగకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా 39 కళాశాలల్లో కేవలం పదహారింటికి మాత్రమే రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మిగతా 23 ఇన్చార్జి ప్రిన్సిపాళ్ల పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి.

జిల్లాలోని 39 కళాశాలల్లో 436 పోస్టులు
రెగ్యులర్ అధ్యాపకులు 165 మందే
కాంట్రాక్టు పద్ధతిలో మరో 187 మంది నియామకం
ఇంకా 84 పోస్టులు ఖాళీ
ఇన్చార్జి ప్రిన్సిపాళ్ల పర్యవేక్షణలో 23 కళాశాలలు
మద్దిలపాలెం, డిసెంబరు 29: ప్రభుత్వ జూనియర్ కళాశాలలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. జిల్లాలోని 39 జూనియర్ కళాశాలల్లో 436 పోస్టులకు గాను ప్రస్తుతం 165 మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. మరో 187 మందిని కాంట్రాక్టు పద్ధతిపై తీసుకున్నారు. ఇంకా 84 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కళాశాలల్లో అవసరం మేరకు గతంలో గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకునేవారు. వారిని ఏటా రెన్యువల్ చేసేవారు. అయితే కొవిడ్-19 ప్రభావంతో కళాశాలలు మూతపడడంతో రెండేళ్ల నుంచి గెస్ట్ ఫ్యాకల్టీల రెన్యువల్ జరగలేదు. ఈ ఏడాది పూర్తిస్థాయిలో కళాశాలలను ప్రారంభించినప్పటికీ గెస్ట్ ఫ్యాకల్టీలను నియమించకపోవడంతో బోధన కుంటుపడింది. జిల్లాలోని 11 కళాశాలల్లో బోటనీ, 16 కళాశాలల్లో చరిత్ర, రాజ్యాంగనీతి శాస్త్రం బోధించడానికి అధ్యాపకులు లేరు. అలాగే ఆంగ్లం అధ్యాపక పోస్టులు 2, తెలుగు 2, హిందీ 8, మ్యాథ్స్ 5, ఫిజిక్స్ 1, జువాలజీ 4, ఎకానమిక్స్ 6, సివిక్స్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధ్యాపకుల కొరత వున్న కళాశాలల్లో బోధన సక్రమంగా సాగకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా 39 కళాశాలల్లో కేవలం పదహారింటికి మాత్రమే రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మిగతా 23 ఇన్చార్జి ప్రిన్సిపాళ్ల పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి.