‘దివీస్’ను సందర్శించిన ఎస్ఈజడ్ కమిషనర్
ABN , First Publish Date - 2021-01-17T05:48:20+05:30 IST
దివీస్ కర్మాగారాన్ని స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఎస్ఈజడ్) కమిషనర్ ఎ.రామమోహన్రెడ్డి శనివారం సందర్శించారు.
భీమునిపట్నం (రూరల్), జనవరి 16: దివీస్ కర్మాగారాన్ని స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఎస్ఈజడ్) కమిషనర్ ఎ.రామమోహన్రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం దివీస్ డైరెక్టర్ మధుసూధనరావు, జీఎం వైఎస్ కోటేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కర్మాగారంలో కొవిడ్ సమయంలో ఉత్పత్తి, ఇతర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే సిబ్బంది పనితీరుపై ఆయన ఆరా తీశారు.