ఏజెన్సీ చట్టాలపై సచివాలయం ఉద్యోగులకు అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2021-08-08T05:59:54+05:30 IST

షెడ్యుల్డ్‌ ప్రాంత చట్టాలపై సచివాలయ ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ లీగల్‌ అడ్వయిజర్‌ త్రినాథరావు అన్నారు.

ఏజెన్సీ చట్టాలపై సచివాలయం ఉద్యోగులకు అవగాహన ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ టీడబ్ల్యూ లీగల్‌ అడ్వయిజర్‌ త్రినాథరావు




చింతపల్లి, ఆగస్టు 7: షెడ్యుల్డ్‌ ప్రాంత చట్టాలపై సచివాలయ ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ లీగల్‌ అడ్వయిజర్‌ త్రినాథరావు అన్నారు. శనివారం స్థానిక బాలుర ఆశ్రమ పాఠశాల-1లో కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల సచివాలయాల ఇంజనీరింగ్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు షెడ్యుల్డ్‌ ప్రాంత చట్టాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంత ప్రజలకు ప్రత్యేక హక్కులు, చట్టాలు రాజ్యాంగం కల్పించడం జరిగిందన్నారు. ప్రధానంగా పెసా, 1/70 భూబదలాయింపు, అటవీ హక్కుల గుర్తింపు, భూసేకరణ, పునరావాస చట్టాలు అమలులో ఉన్నాయన్నారు. ఈకార్యక్రమంలో స్కూల్‌ హెల్త్‌ సమన్వయకర్త నాగరాజు పడాల్‌, ట్రైబల్‌ హెల్త్‌ ప్రాజెక్టు మేనేజర్‌ రాంబాబు, ఆశ్రమ పాఠశాల పీజీహెచ్‌ఎం జేఏ కొండలరావు పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-08T05:59:54+05:30 IST