ఘనంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సం
ABN , First Publish Date - 2021-07-12T05:36:32+05:30 IST
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఇక్కడ ఘనంగా నిర్వహించారు.
నర్సీపట్నం, జూలై 11 : ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఇక్కడ ఘనంగా నిర్వహించారు. విశాఖ రీజియన్ రూరల్ డివిజన్ కార్యదర్శి వై.రాము ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎంవీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు యూనియన్ నిరంతరం పోరాటం సాగిస్తున్నట్టు చెప్పారు. ఏఐటీయూసీ నాయకుడు ఎల్వీ రమణ, సీపీఐ నాయకుడు మాకిరెడ్డి రామానాయుడు, డీసీహెచ్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.