ఉపరాష్ట్రపతి పర్యటనకు బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన

ABN , First Publish Date - 2021-10-30T04:13:33+05:30 IST

మండలంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో నవంబరు 2న ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

ఉపరాష్ట్రపతి పర్యటనకు బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
లా వర్సిటీలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలిస్తున్న అనకాపల్లి డీఎస్పీ సునీల్‌

సబ్బవరం, అక్టోబరు 29 : మండలంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో నవంబరు 2న ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వర్సిటీలో ఆజాదీకా అమృత్‌ ఉత్సవ్‌ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాగా సబ్బవరం నుంచి వర్సిటీ వరకు ట్రాఫిక్‌తో సహా బందోబస్తు ఏర్పాట్లను సీఐ చంద్రశేఖరరావును అడిగి తెలుసుకున్నారు. మెట్లమార్గం, లిఫ్ట్‌, మీటింగ్‌ హాల్లో ఏర్పాట్లు, సమావేశానికి ఎంత మంది హాజరవుతారు? వంటి అన్ని అంశాలను వర్సిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఎల్‌ సురేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పర్యటన విజయవంతం చేసేందుకు భద్రతాపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. 


Updated Date - 2021-10-30T04:13:33+05:30 IST