రాణీచంద్రమణీదేవి ఆస్పత్రిలో కొవిడ్‌ చికిత్స

ABN , First Publish Date - 2021-05-22T04:16:33+05:30 IST

రాణీచంద్రమణీదేవి ఆస్పత్రిలో 30 పడకలతో కొవిడ్‌ వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని నోడల్‌ అధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌ అధికారులను ఆదేశించారు.

రాణీచంద్రమణీదేవి ఆస్పత్రిలో కొవిడ్‌ చికిత్స
అధికారులతో సమీక్షిస్తున్న నోడల్‌ అధికారి వెంకటేశ్వర్‌

 నేటి నుంచి అందుబాటులోకి రానున్న 30 పడకలు

విశాఖపట్నం,  మే 21: రాణీచంద్రమణీదేవి ఆస్పత్రిలో 30 పడకలతో కొవిడ్‌ వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని నోడల్‌ అధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌ అధికారులను ఆదేశించారు. పెదవాల్తేరులోని ఆస్పత్రిని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శనివారం నుంచి చికిత్స అందుబాటులోకి రావాలన్నారు. ఆస్పత్రిలో ఆక్జిన్‌ ప్లాంట్‌ ఏర్పాటుతోపాటు ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న రెండు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అనంతరం రీజనల్‌ కంటి ఆస్పత్రిని సందర్శించి అక్కడి వైద్య పరిస్థితులు తెలుసుకున్నారు. 

Updated Date - 2021-05-22T04:16:33+05:30 IST