యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , First Publish Date - 2021-10-25T05:56:57+05:30 IST
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎస్ఐ ఎ.విభీషణరావు చెప్పారు.

ఎస్ఐ విభీషణరావు
చోడవరం, అక్టోబరు 24: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎస్ఐ ఎ.విభీషణరావు చెప్పారు. జిల్లా యోగా అసోసియేషన్, పతంజలి మోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం ఉషోదయ కళాశాలలో జిల్లా స్థాయి యోగా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాతో ఒత్తిడిని సులభంగా అధిగమించవచ్చన్నారు. విద్యార్థులకు చదువుపరంగా కూడా ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మోగా అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు పైడిరాజు, స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ జొన్నాడ రమణమ్మ శ్రీనివాస్, గోవాడ షుగర్స్ ఏవో పప్పల రమణమూర్తి, గనిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన విద్యార్థులతో పతంజలి యోగా శిక్షణ కేంద్రం డైరెక్టర్ పుల్లేటి సతీశ్ పోటీలకు నిర్వహించారు. ఈ పోటీల విజేతలు వచ్చే నెల 13, 14 తేదీలలో బాపట్లలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారని సతీశ్ తెలిపారు.