శాంతియుత పోరాటాలతో విజయాలు సొంతం
ABN , First Publish Date - 2021-11-23T06:21:57+05:30 IST
శాంతియుత పోరాటాలతో విజయాలు సిద్ధిస్తాయని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్.రామారావు అన్నారు.
![శాంతియుత పోరాటాలతో విజయాలు సొంతం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921112312501452/11232021005033n5.jpg)
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్.రామారావు
కూర్మన్నపాలెం, నవంబరు 22: శాంతియుత పోరాటాలతో విజయాలు సిద్ధిస్తాయని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్.రామారావు అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 284వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షలలో సింటర్ ప్లాంట్ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో రామారావు మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. విమానాశ్రయాలు, బ్యాంకులు, పోర్టులు ఇప్పటికే ప్రైవేటీకరణ అయ్యాయన్నారు. ఈ నెల 26న జరిగే వంటావార్పు కార్యక్రమంలో కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ శిబిరంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, కేఎస్ఎన్ రావు, గంధం వెంకటరావు, వరసాల శ్రీనివాసరావు, మస్తానప్ప, రామ్మోహన్కుమార్, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్, జి.ఆనంద్, నారాయణరావు, నరసింగరావు, బాబూరావు, మూర్తి, శ్రీనివాస్, ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.