పాఠశాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఆరా
ABN , First Publish Date - 2021-07-25T05:19:07+05:30 IST
స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలను ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.

గోపాలపట్నం, జూలై 24: స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలను ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పాఠశాలలో జరుగుతున్న ఆన్లైన్ తరగతుల గురించి ఉపాధ్యా యులతో చర్చించారు. త్వరలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యా యుల తో సమీక్షించారు. అభివృద్ధి పనులపై పాఠశాలల హెచ్ఎంలు హెప్సిబా, రజనీలకు పలు సూచనలు ఇచ్చారు.