వార్డుల్లో గంటా ఎన్నికల ప్రచారం
ABN , First Publish Date - 2021-03-05T06:20:20+05:30 IST
ఉత్తరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గ్రేటర్ 42వ వార్డులో గురువారం విస్తృతంగా ప్రచారం చేశారు.
అభ్యర్థులతో కలిసి ఓట్లు అర్థించిన మాజీ మంత్రి
తాటిచెట్లపాలెం, మార్చి 4: ఉత్తరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గ్రేటర్ 42వ వార్డులో గురువారం విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థి ఆకిరెడ్డి లక్ష్మీ జగదీష్ ఆధ్వర్యంలో తొలుత ఆయన స్థానిక లక్ష్మీగణేష్ ఆలయంలో పూజలు నిర్వహిం చారు. అనంతరం రైల్వే న్యూకాలనీ, మసీదు వీధి, రామాలయం, బజారు, ప్రధాన రహదారి ప్రాంతాల్లో పర్యటించారు.
ఓటర్లకు అభివాదం చేస్తూ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా తీన్మార్ బ్యాండ్, డీజే సౌండ్లతో హోరెత్తించారు. ప్రచారంలో పార్టీ ఉత్తరం ఇన్చార్జి చిక్కాల విజయ్బాబు, ఆకిరెడ్డి జగదీష్, మాజీ కార్పొరేటర్ గోగినేని సాంబ శివరావు, దువ్వి కాళీప్రసాద్, రామకృష్ణ, వెంకటరమణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.