మత్స్యకారుల కుటుంబాలకు ఆసరా

ABN , First Publish Date - 2021-01-21T05:32:42+05:30 IST

సముద్రంలో చేపలవేటకు వెళ్లి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్‌ మత్స్యకార ప్రమాద బీమా పథకం కింద మంజూరైన పరిహారం చెక్కులను బుధవారం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు.

మత్స్యకారుల కుటుంబాలకు ఆసరా
పరిహారం చెక్కులు అందజేస్తున్న మంత్రి ముత్తంశెట్టి

వేటకు వెళ్లి చనిపోయిన వారికి బీమా పరిహారం అందజేత

చెక్కులు అందజేసిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 

సీతమ్మధార, జనవరి 20: సముద్రంలో చేపలవేటకు వెళ్లి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్‌ మత్స్యకార ప్రమాద బీమా పథకం కింద మంజూరైన పరిహారం చెక్కులను బుధవారం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. సీతమ్మధారలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. గత ఏడాది ఆగస్టులో భీమిలి నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు చెందిన ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి చనిపోయారు. వీరికి రూ.10 లక్షలు బీమా మొత్తం మంజూరైంది.

Updated Date - 2021-01-21T05:32:42+05:30 IST