మూతపడిన మీ సేవా కేంద్రం
ABN , First Publish Date - 2021-04-01T05:02:50+05:30 IST
పారిశ్రామిక ప్రాంతంలో ఏడు వార్డులకు సంబంఽధించి కోరమాండల్ గేటు ఎదురుగా ఉన్న ప్రభుత్వ మీ సేవా కేంద్రం మూతపడింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 4
స్థానికులకు తప్పని ఇబ్బందులు
మల్కాపురం, మార్చి 31: పారిశ్రామిక ప్రాంతంలో ఏడు వార్డులకు సంబంఽధించి కోరమాండల్ గేటు ఎదురుగా ఉన్న ప్రభుత్వ మీ సేవా కేంద్రం మూతపడింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 40, 58 నుంచి 63 వార్డుల ప్రజలు వివిధ పన్నులు చెల్లించడంతో పాటు ధ్రువపత్రాలు, ప్రభుత్వ పఽథకాలకు దరఖాస్తు చేయడం, భూముల సర్వేనంబర్ల వివరాలు ఇలా అనేక సేవల కోసం ఈ కేంద్రంపై ఆధారపడేవారు. అయితే ఈ కేంద్రం కొవిడ్ ప్రభావం నుంచీ మూతపడి ఇప్పటికీ తెరచుకోలేదు. దీని వల్ల పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజువాక, లేదా జ్ఞానాపురం జోన్ 4 కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. దీంతో సమయం వృథా కావడమే కాకుండా శ్రమ పడాల్సి వస్తోందంటున్నారు. ప్రైవేటు కేంద్రాలున్నప్పటికీ పూర్తిస్థాయిలో ఉపయోగంలో లేవు. సచివాలయాల్లోనే అంతంతమాత్రంగానే పనులు జరుగుతున్నాయంటున్నారు. అధికారులు చర్యలు తీసుకుని మీ సేవా కేంద్రాన్ని తిరిగి తెరిచేలా చూడాలని కోరుతున్నారు.