టీడీపీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిద్దాం

ABN , First Publish Date - 2021-10-28T06:11:08+05:30 IST

నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిద్దామని టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ అన్నారు.

టీడీపీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిద్దాం
నాయకులతో మాట్లాడుతున్న నియోజకవర్గ ఇన్‌చార్జి కుమార్‌

పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌


మాడుగుల రూరల్‌, అక్టోబరు 27: నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిద్దామని టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ అన్నారు. మండలంలోని వీజే పురంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలను బుధవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో కుమార్‌ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి కలిసికట్టుగా శ్రమిద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చామంతలు జయరామ్‌, శనివాడ నాయుడు, శ్రీను, జెర్రిపోతుల రామారావు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T06:11:08+05:30 IST