ఆంజనేయస్వామికి లక్ష తమలపత్రార్చన
ABN , First Publish Date - 2021-02-27T05:26:33+05:30 IST
స్థానిక విజినిగిరిపాలెం అభయ ఆంజనేయస్వామికి శుక్రవారం లక్ష తమలపత్రార్చన నిర్వహించారు.
సింహాచలం, ఫిబ్రవరి 26: స్థానిక విజినిగిరిపాలెం అభయ ఆంజనేయస్వామికి శుక్రవారం లక్ష తమలపత్రార్చన నిర్వహించారు. ఆలయ మూడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేకువజామునే ఉత్సవాలకు వినాయక పూజతో శ్రీకారం చుట్టి పంచామృతాభిషేకాలు, అనంతరం శ్రీరామ పట్టాభిషేకం, రాత్రి తిరువీఽథి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.