కొవిడ్ సెకెండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-05-12T05:12:52+05:30 IST
కొవిడ్ మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్న ఫ్రంట్లైన్ వర్కర్లు, సాధారణ ప్రజలు రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య సూచించారు.
సబ్ కలెక్టర్ మౌర్య
నర్సీపట్నం, మే 11: కొవిడ్ మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్న ఫ్రంట్లైన్ వర్కర్లు, సాధారణ ప్రజలు రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య సూచించారు. వేములపూడి పీహెచ్సీలో వ్యాక్సిన్ ప్రక్రియను మంగళవారం ఆమె పరిశీలించారు. వ్యాక్సిన్ కోసం వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించి, బౌతిక దూరం పాటించాలని కోరారు. డివిజన్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ నెల 11 నుంచి 31వ తేదీ వరకు రెండో మోతాదు వ్యాక్సిన్ వేయనున్నట్టు చెప్పారు. మొదటి డోసు తీసుకొని నాలుగు వారాలు దాటిన వారికి సెకెండ్ డోస్ వేస్తారన్నారు. పీహెచ్సీలలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ అందుబాటులో ఉంటాయన్నారు. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తప్పనిసరిగా రెండో డోసు వేయించుకోవాలన్నారు. సెల్ఫోన్లో వారికి సమాచారం ఇస్తారని, ఒకవేళ సమాచారం రాకపోతే పీహెచ్సీలకు నేరుగా వెళ్లి వేయించుకోవచ్చునని సబ్ కలెక్టర్ తెలిపారు.