కమనీయం అప్పన్న కళ్యాణం
ABN , First Publish Date - 2021-12-19T05:52:06+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామి నిత కళ్యాణం నేత్రపర్వంగా సాగింది.
![కమనీయం అప్పన్న కళ్యాణం](https://media.andhrajyothy.com/appimg/galleries/192112191217243/12192021002151n15.jpg)
సింహాచలం, డిసెంబరు 18: వరాహలక్ష్మీనృసింహస్వామి నిత కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా శనివారం ఉదయం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కళ్యాణ మండపంలో అధిష్టింపజేశారు. ఆలయ ఇన్చార్జి ప్రధానార్చకుడు ఐవీ రమణాచార్యులు పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.