మొగలిపురంలో జేసీ పర్యటన
ABN , First Publish Date - 2021-09-29T06:43:39+05:30 IST
మండలంలోని మొగలిపురం గ్రామంలో జేసీ అరుణ్బాబు, డీపీవో కృష్ణకుమారి మంగళవారం పర్యటించారు.
సబ్బవరం, సెప్టెంబరు 28 : మండలంలోని మొగలిపురం గ్రామంలో జేసీ అరుణ్బాబు, డీపీవో కృష్ణకుమారి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు గులాబ్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న ఇళ్లను, వరద నీరు చేరిన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ఎక్కడా నీరు నిల్వ లేకుండా పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది సత్వర చర్యలు చేపట్టాలన్నారు. వారి వెంట తహసీల్దార్ రమాదేవి, ఈవోపీఆర్డీ మహేశ్, ఆర్ఐ సుధాకర్, మాజీ సర్పంచ్ బైలపూడి సత్యం, తమరాన బంగారునాయుడు, అంగటి నానాజీ తదితరులు ఉన్నారు.