జిల్లాలో 31 వేల మందికి ‘జగనన్న తోడు’

ABN , First Publish Date - 2021-10-21T04:41:12+05:30 IST

జిల్లాలోని 31,465 మంది లబ్ధిదారులు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా ఒక కోటి 9 లక్షల రూపాయల వడ్డీ లబ్ధి పొందారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

జిల్లాలో 31 వేల మందికి ‘జగనన్న తోడు’
మహిళలకు చెక్కు అందజేస్తున్న మంత్రి, మేయర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌, జేసీలు

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖపట్నం, అక్టోబరు 20: జిల్లాలోని 31,465 మంది లబ్ధిదారులు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా ఒక కోటి 9 లక్షల రూపాయల వడ్డీ లబ్ధి పొందారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. తాడేపల్లి నుంచి బుధవారం పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పాల్గొన్నారు.


ప్రభుత్వం అందించిన ఈ సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, ఇంకా బ్యాంకులకు వడ్డీలు కట్టనివారు డిసెంబరులోగా దాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, జడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, జేసీలు ఎం.వేణుగోపాలరెడ్డి, పి.అరుణబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T04:41:12+05:30 IST