సహస్రాబ్ది సమారోహానికి శారదా పీఠాధిపతికి ఆహ్వానం
ABN , First Publish Date - 2021-12-07T05:20:56+05:30 IST
త్రిదండి చినజీయర్ స్వామి నిర్వహిస్తున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహానికి హాజరు కావలసిందిగా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ఆహ్వానం అందింది.
పెందుర్తి, డిసెంబరు 6: త్రిదండి చినజీయర్ స్వామి నిర్వహిస్తున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహానికి హాజరు కావలసిందిగా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ఆహ్వానం అందింది. చినముషిడివాడలోని శారదా పీఠాన్ని సోమవారం చినజీయర్ స్వామి తరఫున అష్టాక్షరి జీయర్ స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరిలో నిర్వహించనున్న సహస్రాబ్ది సమారోహానికి హాజరుకావల సిందిగా ఆహ్వానపత్రిక అందజేశారు.