హోరాహోరీగా బాల్బ్యాడ్మింటన్ పోటీలు
ABN , First Publish Date - 2021-12-26T05:47:06+05:30 IST
స్థానిక రాజీవ్గాంధీ క్రీడామైదానంలో 7వ రాష్ట్రస్థాయి అంతర జిల్లాల స్ర్తీ, పురుష బాల్ బాడ్మింటన్ పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. ఎలమంచిలి బాల్ బాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

ఎలమంచిలి, డిసెంబరు 25: స్థానిక రాజీవ్గాంధీ క్రీడామైదానంలో 7వ రాష్ట్రస్థాయి అంతర జిల్లాల స్ర్తీ, పురుష బాల్ బాడ్మింటన్ పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. ఎలమంచిలి బాల్ బాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషులకు తీసిపోని విధంగా బాలికలు సత్తా చాటుతున్నారు. పాయింట్ల పట్టిక ఆధారంగా ఏ పూల్, బి పూల్ నుంచి రెండేసి జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయని, సెమీఫైనల్, ఫైనల్ ఆదివారం జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. స్థానిక సంఘం ప్రతినిధులు ఆదినారాయణ, గొర్లె రామకృష్ణ, వీరప్రజానాయక్ తదితరులు పోటీలను పర్యవేక్షిస్తున్నారు.
సెమిస్కు చేరిన జట్లు
పురుషుల జట్టులో పూల్ ఎ నుంచి విశాఖపట్నం, కర్నూలు, పూల్ బి నుంచి అనంతపురం, ప్రకాశం జట్లు, మహిళల విభాగంలో పూల్ ఏ నుంచి విశాఖ, నెల్లూరు జట్లు సెమీఫైనల్ చేరాయని, సమయం చాలక మహిళల పూల్ బి జట్లకు పోటీ నిర్వహించలేదని నిర్వాహక సంఘం ప్రతినిధి రామకృష్ణ తెలిపారు.