ప్రమాదకర చెత్తను వేరుగా ఉంచాలి
ABN , First Publish Date - 2021-12-31T05:54:07+05:30 IST
ప్రమాదకరమైన చెత్తను సాధారణ చెత్తతో కలిపేసి అందించవద్దని, అటువంటి చెత్తపై ప్రజలకు పారిశుధ్య కార్మికులు అవగాహన కల్పించాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీషా సూచించారు.
![ప్రమాదకర చెత్తను వేరుగా ఉంచాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921123112220551/12312021002240n53.jpg)
గ్రేటర్ కమిషనర్ లక్ష్మీషా
విశాఖపట్నం, డిసెంబరు 30: ప్రమాదకరమైన చెత్తను సాధారణ చెత్తతో కలిపేసి అందించవద్దని, అటువంటి చెత్తపై ప్రజలకు పారిశుధ్య కార్మికులు అవగాహన కల్పించాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీషా సూచించారు. గ్రేటర్ 42వ వార్డు పరిధి అక్కయ్యపాలెం, 80 అడుగుల రోడ్డు, జగ్గారావు బ్రిడ్జి, శ్రీనివాసనగర్, గోలీలపాలెం, కర్రివారి బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీతో కలిసి గురువారం ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా ప్రమాదకర వర్థాలను సాధారణ చెత్తతో కలిపి సేకరించడంపై శానిటరీ ఇన్స్పెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తడి, పొడి చెత్తతోపాటు ప్రమాదకర చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించి వేర్వేరుగా సేకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ఉషశ్రీ కమిషనర్ దృష్టికి పలు సమస్యలు తీసుకు వెళ్లగా అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపట్టను న్నట్టు కమిషనర్ హామీ ఇచ్చారు.