సంపత్ వినాయకుడిని దర్శించిన మిజోరం గవర్నర్
ABN , First Publish Date - 2021-11-02T06:51:28+05:30 IST
నగరంలోని ఆశీల్మెట్ట వద్ద కొలువుదీరిన సంపత్ వినాయకుడిని సోమవారం ఉదయం మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు దంపతులు దర్శించుకుని పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
![సంపత్ వినాయకుడిని దర్శించిన మిజోరం గవర్నర్](https://media.andhrajyothy.com/appimg/galleries/192111020115178/11022021012123n69.jpg)
సిరిపురం, నవంబరు 1: నగరంలోని ఆశీల్మెట్ట వద్ద కొలువుదీరిన సంపత్ వినాయకుడిని సోమవారం ఉదయం మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు దంపతులు దర్శించుకుని పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి అభిషేకాన్ని తిలకించారు. అనంతరం హరిబాబుకు వేదాశీర్వచనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ టీఆర్ చోళన్ పాల్గొన్నారు.