సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దృష్టికి చెరకు రైతులు, కార్మికుల సమస్యలు
ABN , First Publish Date - 2021-11-26T06:27:51+05:30 IST
జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాల పరిస్థితి, చెరకు రైతులు, కార్మికుల సమస్యలను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకు వెళ్లి నట్టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్ తెలిపారు.

పాయకరావుపేట, నవంబరు 25 : జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాల పరిస్థితి, చెరకు రైతులు, కార్మికుల సమస్యలను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకు వెళ్లి నట్టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్ తెలిపారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడులో గురువారం లక్ష్మీనారాయణను కలిసి తాండవ, ఏటికొప్పాక, గోవాడ చక్కెర కర్మాగారాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరించామన్నారు. దీనిపై స్పందించి ఆయన త్వరలో జిల్లాలో చక్కెర కర్మాగారాలను సందర్శిస్తానని హామీ ఇచ్చారని నగేష్ చెప్పారు.