ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-10-28T06:20:20+05:30 IST

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి బుధవారం సందర్శించారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమస్యల పరిష్కారానికి కృషి
కళాశాల ఆవరణను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గణేశ్‌, చైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి

 

 ఎమ్మెల్యే ఉమాశంకర్‌గణేశ్‌

నర్సీపట్నం, అక్టోబరు 27 : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను  ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి బుధవారం సందర్శించారు. కళాశాల తరగతి గదుల్లో సమస్యలను విద్యార్థులు, అధ్యాపకుల ద్వారా తెలుసుకున్నారు. తాగునీరు, మరుగుదొడ్ల తదితర సమస్యలు ఉన్నట్టు వారు వివరించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో కళాశాలలోని పదిహేను తరగతి గదులను పదిహేను మంది వైసీపీ నాయకులు దత్తత తీసుకొని రంగులు, మైనర్‌ రిపేర్లు చేయిస్తారని తెలిపారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గొలుసు నర్సింహమూర్తి, గొలుగొండ జడ్పీటీసీ గిరిబాబు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T06:20:20+05:30 IST