వాయిద్య పరికరాలకు గిరాకీ
ABN , First Publish Date - 2021-04-14T05:24:08+05:30 IST
గిరిజనుల వివాహ వేడుకలు, శుభకార్యాల్లో మేళాతాళాల కోసం వినియోగించే వివిధ రకాల వాయిద్య పరికరాలకు గిరాకీ పెరిగింది.
సంతలో అమ్మకానికి తెస్తున్న ఒడిశా వృత్తికారులు
పెదబయలు, ఏప్రిల్ 13: గిరిజనుల వివాహ వేడుకలు, శుభకార్యాల్లో మేళాతాళాల కోసం వినియోగించే వివిధ రకాల వాయిద్య పరికరాలకు గిరాకీ పెరిగింది. ఆదివాసీల పండుగలు, ధింసా నృత్యాల్లో కూడా వీటిని వినియోగిస్తుంటారు. తుడుము డప్పులు, నరిగే డప్పులు, సోనాయ్ తదితర పేర్లతో పిలిచే వీటిని జంతు చర్మాలతో తయారు చేస్తారు. పెదబయలులో ప్రతి సోమవారం జరిగే సంతకు పక్కనే వున్న ఒడిశా నుంచి పలురకాల వాయిద్య పరికరాలను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. గతంలో ఎక్కువ మంది వీటిని తయారుచేసేవారు. కానీ ఆధునిక వాయిద్య పరికరాలు వచ్చిన తరువాత వీటికి గిరాకీ తగ్గింది. దీంతో చాలా మంది ఈ వృత్తికి స్వస్తి చెప్పారు. ప్రస్తుతం ఒకరిద్దరు మాత్రమే ఈ వాయిద్య పరికరాలను సంతకు తీసుకువస్తున్నారు. దీంతో గిరాకీ పెరిగింది. శ్రమకు తగ్గిన ప్రతిఫలం లభిస్తున్నదని తయారీదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.