మరో 40 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-10-29T06:17:56+05:30 IST

జిల్లాలో గురువారం మరో 40 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది.

మరో 40 మందికి కరోనా

విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం మరో 40 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,58,150కు చేరింది. ఇందులో 1,56,279 మంది కోలుకోగా, మరో 775 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌తో 1,096 మంది మృతిచెందారు.


ఏఎంసీ విద్యార్థికి కొవిడ్‌ పాజిటివ్‌

మహారాణిపేట, అక్టోబరు 28: ఆంధ్ర వైద్య కళాశాల (ఏఎంసీ) విద్యార్థి ఒకరు కరోనా బారినపడ్డారు. విద్యార్థికి కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ అని తేలింది. ఆ విద్యార్థితో సన్నిహితంగా మెలిగిన విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2021-10-29T06:17:56+05:30 IST