స్థానికులకు ఉపాధి కల్పించాలని ఆందోళన

ABN , First Publish Date - 2021-12-07T05:22:05+05:30 IST

హెచ్‌పీసీఎల్‌లో స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు సోమవారం ఆ సంస్థ లేబర్‌ గేటు వద్ద ఆందోళన చేశారు.

స్థానికులకు ఉపాధి కల్పించాలని ఆందోళన
హెచ్‌పీసీఎల్‌ లేబర్‌ గేటు వద్ద ఆందోళన చేస్తున్న వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు

హెచ్‌పీసీఎల్‌ గేటు వద్ద వైసీపీ నిరసన

మల్కాపురం, డిసెంబరు 6: హెచ్‌పీసీఎల్‌లో స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు సోమవారం ఆ సంస్థ లేబర్‌ గేటు వద్ద ఆందోళన చేశారు. కాంట్రాక్టు కార్మికులు విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం హెచ్‌పీసీఎల్‌ గేటు నుంచి కల్యాణి గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పీవీ సురేశ్‌, గుండపు నాగేశ్వరరావు, బల్ల లక్ష్మణరావు, ఏడు వార్డుల వైసీపీ ఇన్‌చార్జి దాడి సత్యనారాయణ, ట్రేడ్‌ యూనియన్‌ల నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-07T05:22:05+05:30 IST