పాత నేరస్థులకు సీఐ కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2021-11-22T04:56:00+05:30 IST
పాత నేరస్థులు నేరచరిత్ర విడనాడాలని వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐ లూఽథర్బాబు హెచ్చరించారు. స్థానిక పోలీస్స్టేషన్లో పాతనేరస్థులకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు.

గోపాలపట్నం, నవంబరు 21: పాత నేరస్థులు నేరచరిత్ర విడనాడాలని వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐ లూఽథర్బాబు హెచ్చరించారు. స్థానిక పోలీస్స్టేషన్లో పాతనేరస్థులకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా లూథర్బాబు మాట్లాడుతూ పాతనేరస్థులు ఎటువంటి నేరాలకు పాల్పడకుండా జీవనం సాగించాలని సూచించారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెడతామని, నేరాలకు పాల్పడితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సత్యనారాయణ, ఏఎస్ఐ గోవిందమ్మ, పీసీలు గణేశ్, మహేశ్వరి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.