అంబులెన్స్లో ప్రసవం : తల్లీబిడ్డ క్షేమం
ABN , First Publish Date - 2021-05-11T05:06:35+05:30 IST
నిండు గర్భిణి అంబులెన్స్లోనే ప్రసవం జరిగిన సంఘటన జి.మాడుగుల మండలం పాలమామిడిలో సోమవారం చోటుచేసుకుంది.
పాడేరు/జి.మాడుగుల, మే 10: నిండు గర్భిణి అంబులెన్స్లోనే ప్రసవం జరిగిన సంఘటన జి.మాడుగుల మండలం పాలమామిడిలో సోమవారం చోటుచేసుకుంది. ఇందు కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో పాలమామిడిలో గర్భిణి పాంగి లలితకు పురిటి నొప్పులు రావడంతో ఆసరా వైద్య సంస్థకు చెందిన అంబులెన్స్ గ్రామానికి వెళ్లింది. అయితే కరోనా నేపథ్యంలో ఆ గ్రామంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. అలాగే గ్రామానికి శివారున అంబులెన్స్ను నిలుపుదల చేశారు. దీంతో ఆసరా సంస్థ వైద్య సిబ్బంది, బంధువులు కలిసి గర్భిణిని ఇంటి వద్ద నుంచి నడిపించుకుంటూ తీసుకువచ్చారు. దీంతో ఆమెకు పురిటి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్లోనే పురుడు పోశారు. లలిత పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో వారిద్దరినీ అంబులెన్స్లో జి.మాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించడంతో క్షేమంగానే ఉన్నారు.