శారదా పీఠాన్ని సందర్శించిన ప్రముఖులు
ABN , First Publish Date - 2021-09-29T06:41:04+05:30 IST
జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మంగళవారం చినముషిడివాడ శారదా పీఠాన్ని సందర్శించారు.
పెందుర్తిరూరల్, సెప్టెంబరు 28: జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మంగళవారం చినముషిడివాడ శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠంలోనిల దేవతామూర్తులను దర్శించి పూజలు చేశారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిలను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వీరితో పాటు తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎమ్మెల్సీ రమేశ్యాదవ్, వ్యాపారవేత్త శశాంక్ రెడ్డి శారదా పీఠాన్ని సందర్శించి స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు.