వ్యవసాయ చట్టాల ప్రతులు దహనం
ABN , First Publish Date - 2021-01-14T05:20:24+05:30 IST
మండలంలోని పెదలబుడు పంచాయతీ శరభగుడ గ్రామానికి చెందిన గిరిజన రైతులు, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి మూడు వ్యవసాయ చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు.
![వ్యవసాయ చట్టాల ప్రతులు దహనం](https://media.andhrajyothy.com/appimg/galleries/2021011311491365/01132021234941n70.jpg)
కేంద్రం తీరుపై గిరిజనులు, సీఐటీయూ నిరసన
అరకులోయ టౌన్: మండలంలోని పెదలబుడు పంచాయతీ శరభగుడ గ్రామానికి చెందిన గిరిజన రైతులు, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి మూడు వ్యవసాయ చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ చట్టాల వల్ల తమకు ఎంతోనష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కె.గోపి, పి.రాము, టి.హరి, మగ్గన్న, సహదేవ్,నానిబాబు, కోటి, తదితరులు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సీఐటీయూ నాయకులు బుధవారం ఆయా ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు ఎస్.గురుముసింగ్ మాట్లాడుతూ, ఈ చట్టాల వల్ల గిరిజన రైతులకు ఊహించని నష్టం జరుగుతుందని అన్నారు.